నాలుగు వందలకు పైగా చరిత్ర కలిగిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దేశ,విదేశాల్లో పర్యాటక ప్రాంతాలున్న నగరంగా ఎంతో పేరు,ప్రఖ్యాతులు సంపాదించింది. నగరంలోని వివిధ చారిత్రక కట్టడాలు నేడు ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక ేకంద్రాలుగా ప్రత్యేక గుర్తింపును సాధించారుు. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక పటంలో హైదరాబాద్కు ప్రముఖ స్థానం ఉంది.నగరంలోని చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్లు ప్రతిరోజు దేశ,విదేశీ పర్యాటకులతో సందడిగా కనిపిస్తుంటారు.ఈ కట్టడాలు నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ సంస్కృతీ,సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తారుు. ఇవన్నీ నేడు హైదరాబాద్ వారసత్వ సంపదగా పేరుగాంచారుు.ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఈ చారిత్రక కట్టడాల గురించి తెలుసుకుందామా...
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
చార్మినార్...
హైదరాబాద్ను పరిపాలించిన కుతుబ్షాహి రాజవంశస్థుల్లో అరుుదవ చక్రవర్తి అరుున సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్షా చార్మినార్ను నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో హైదరాబాద్లో భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చింది. దీంతో మహ్మద్ కులీకుతుబ్షా తన హైదరాబాద్ సామ్రాజ్యంలోని ప్రజలను ప్లేగు వ్యాధి బారినుంచి రక్షించేందుకు చార్మినార్ను నిర్మించారు.
దీంతో మహ్మద్ కులీకుతుబ్షా తన హైదరాబాద్ సామ్రాజ్యంలోని ప్రజలను ప్లేగు వ్యాధి బారినుంచి రక్షించేందుకు చార్మినార్ను నిర్మించారు. తాను ప్రార్థనలు జరిపే చోట మజీద్లాంటి చార్మినార్ను రూపొందించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ భారీ కట్టడానికి శంకుస్థాపన చేసేటప్పుడు కులీకుతుబ్షా అల్లాను ప్రార్థిస్తూ హైదరాబాద్ నగరం శాంతి, సౌఖ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. నీటిలో చేపల మాదిరిగా తన నగరంలో లక్షలాది ప్రజలు జీవించాలని కోరుకున్నారు. ఇక సనంవెంకట బాలయ్య ‚అనే వ్యక్తికి చార్మినార్ను నిర్మించే బాధ్యతలను అప్పగించారు. నాలుగు మినార్లతో నిర్మించిన ఈ కట్టడానికి చార్మినార్ను అనే పేరును పెట్టారు మహ్మద్ కులీకుతుబ్షా. ఈ అద్భుత కట్టడం ప్రపంచంలోనే అపురూప కట్టడంగా పేరొందింది.
గోల్కొండ...
గోల్కొండ కోట ప్రధానగేటు వద్ద చప్పట్లు కొడితే కోట పైభాగాన300 అడుగుల ఎత్తునఉన్న పోర్టికో కట్టడంలో శబ్దం వినిపిస్తుంది.ప్రపంచంలోఎక్కడా లేనివిధంగాఈ కోటలోఇటువంటిఅద్భుతాన్నిచూడవచ్చు.
ఇదే గోల్కొండ కోట ప్రత్యేకత.
పిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈ కోటలో ఇటువంటి అద్భుతాన్ని చూడవచ్చు. ఇదే గోల్కొండ కోట ప్రత్యేకత. నాడు ఈ కోట వద్ద వజ్రాల వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది. వజ్రాలను వీధులలో పోసి అమ్మేవారని చరిత్ర చెబుతుంది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం గోల్కొండ కోటకు చెందినదే. హోప్ డైమండ్ కూడా ఇక్కడిది కావడం విశేషం. గోల్కొండకు వాయువ్య దిశలోని కుల్లూరు గనులలో నాడు వజ్రాలు లభించేవి. ఇక ఈ కోటను 120 మీటర్ల కొండపైన నిర్మించారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు 1687లో ఈ కోటను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించాడు. తొమ్మిది నెలల పాటు గోల్కొండ కోటను శత్రువులకు దక్కకుండా కుతుబ్షాహి చక్రవర్తి పోరాడాడు. చివరికి ఈ కోట మొగల్ చక్రవర్తి వశమైంది. తానీషా కాలంలో భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న చక్రవర్తికి చెప్పకుండా రాజ్యానికి చెందిన డబ్బులతో భద్రాచలాన్ని నిర్మించాడు. ఇది తెలిసిన చక్రవర్తి రామదాసును గోల్కొండ కోటలోని ఓ జైలులో బంధించాడు. ఈ జైలు నేటికీ గోల్కొండ కోటలో చూడవచ్చు.
సాలార్జంగ్ మ్యూజియం..
సాలార్జంగ్ మ్యూజియంలో అద్భుతమైన కళాఖండాలు, పెరుంటింగ్స్, కార్వింగ్స్, ఆకర్షణీయమైన రాచరిక వస్త్రాలు, తాళపత్ర గ్రంథాలు, సెరామిక్ వస్తువులు, మెటల్ కళాకృతులు, కార్పెట్లు, గడియారాలు, దేశ, విదేశాలకు చెందిన అందమైన ఫర్నీచర్ను పొందుపరిచారు. మనదేశంతో పాటు జపాన్, చైనా, బర్మా,నేపాల్,పర్షియా,ఈజిప్ట్,యూరప్, అమెరికాలకు చెందిన ఆకర్షణీయమైన ఫర్నీచర్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఇసాలార్జంగ్ సేకరించిన కళాఖండాల్లో కేవలం సగం మాత్రమే నేడు సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయని అంటారు. ఇక ముందుగా దివాన్దేవ్డీలో కొనసాగిన ఈ మ్యూజియాన్ని మదీనాకు సమీపంలోని మూసీనది తీరంలో నిర్మించిన కొత్త భవనానికి తరలించారు. ఈ సందర్భంగా పలు కళాఖండాలు చోరీకి గురయ్యాయి. 1968లో మ్యూజియాన్ని తరలించారు. ప్రస్తుతం ఈ మ్యూజియం నిర్వహణను ట్రస్టీలతో కూడిన బోర్డు చూసుకుంటుండగా రాష్ట్ర గవర్నర్ బోర్డు ఎక్స్-అఫియో చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. రాజారవివర్మకు చెందిన అరుదైన పెయింటింగ్స్, ఔరంగాజేబు ఉపయోగించిన ఖడ్గం, జహంగీర్, నూర్జహాన్, షాజహాన్ వంటి మొగల్లకు చెందిన డాగర్లు, టిప్పు సుల్తాన్కు చెందిన ఆయుధాలు, వస్తువులు, బంగారం, వజ్రాలతో తయారైన టిఫిక్ బాక్స్ వంటివి సాలార్జంగ్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
చౌమహల్లా ప్యాలెస్..
1750లో ఐదవ నిజాం నవాబ్ సలాబత్ జంగ్ చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని ్ర పారంభించారు. ఎంతో అందంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం నిర్మాణం 1869లో ముగిసింది. టెహ్రాన్లోని ఇరాన్ షా ప్యాలెస్ నమూనాలో దీన్ని నిర్మించినట్టు ప్రతీతి.
ఇక 1750లో ఐదవ నిజాం నవాబ్ సలాబత్ జంగ్ చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎంతో అందంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం నిర్మాణం 1869లో ముగిసింది. టెహ్రాన్లోని ఇరాన్ షా ప్యాలెస్ నమూనాలో దీన్ని నిర్మించినట్టు ప్రతీతి. ఈ ప్యాలెస్లో రెండు కోర్టు యార్డ్లు ఉన్నాయి. నాలుగు అందమైన ప్యాలెస్ల సమాహారంగా దీన్ని నిర్మించారు. దర్బార్ గ్రాండ్ ఖిల్వత్ను అత్యద్భుతంగా రూపొందించారు. అందమైన ఫౌంటేన్లు, గార్డెన్లతో 45 ఎకరాల సువిశాల స్థలంలో నిజాం నవాబులు తన అధికారిక నివాసాన్ని నిర్మించారు.
ఫలక్నుమా ప్యాలెస్...