సంబల్పురి అనే మాండలిక ఒరిస్సా భాషను ఇక్కడవారు మాట్లాడతారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో నివసించే గిరిజన ప్రజల ప్రభావం సంబల్పూర్ మీద ఉంది. సంబల్పూర్కు ప్రాచీన చరిత్ర కూడా ఉంది. ఈ నగరం దక్షిణ కోసలలో భాగంగా ఉండేది. సంబల్పూర్ను పరిపాలించిన రాజా ఇంద్రభూతి ఇక్కడ వజ్రయాన బౌద్ధమతం వ్యాప్తికి కృషి చేశాడు. కళింగ సామ్రాజ్య చక్రవర్తి ఖారవేలుడు సమయంలో ఈ ప్రాంతాన్ని అత్తాభికగా పిలిచేవారు. కళింగ-ఉత్కళ సామ్రా జ్యానికి చెందిన సామంతులైన సోమ, గంగ, సూర్య, గజపతి రాజులు సంబల్పూర్ను పరిపాలించారు.
చూడవలసిన ప్రాంతాలు
సామలేశ్వరి దేవాలయం
సంబల్పూర్లో మహానది ఒడ్డున ఉంది సామలై గుడి. ఈమెను శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుస్తారు.
బుద్ధరాజ దేవాలయం
మహాశివుని దేవాలయం బుద్ధరాజ మందిరం. స్థానికంగా ఉన్న బుద్ధరాజ కొండపై ఈ దేవాలయం ఉంది.
హీరాకుడ్ ఆనకట్ట
ఉషాకోఠి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
సంబల్పూర్కు 48 కి.మీ. దూరంలో బద్రామాలో ఉంది ఉషా కోఠి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం. దట్టమైన అడవుల్లో ఏను గులు, పులులు, జింకలు, అడవి పందులు వంటివి ఉన్నాయి.
ఛిప్లిమా జల విద్యుత్ కేంద్రం
ఎలా చేరుకోవాలి
విమాన మార్గం: భువనేశ్వర్ (325 కి.మీ.), రాయ్పూర్ (300 కి.మీ.) రైలు మార్గం: సంబల్పూర్లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి చెన్నై, ముంబయి, కోల్కతా, హౌరా, భువనేశ్వర్లకు నేరుగా రైళ్లు ఉన్నాయి. సమీపంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్ ఝార్సూగూడా (48 కి.మీ.). ఇది హౌరా-ముంబయి ప్రధాన రైలు మార్గంలో ఉంది. రహదారి మార్గం: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సు సేవలు ఉన్నాయి
No comments:
Post a Comment