Total Pageviews

Wednesday 28 September 2011

పర్యాటక, చారిత్రక వైభోగం భాగ్యనగరం

నాలుగు వందలకు పైగా చరిత్ర కలిగిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ దేశ,విదేశాల్లో పర్యాటక ప్రాంతాలున్న నగరంగా ఎంతో పేరు,ప్రఖ్యాతులు సంపాదించింది. నగరంలోని వివిధ చారిత్రక కట్టడాలు నేడు ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక ేకంద్రాలుగా ప్రత్యేక గుర్తింపును సాధించారుు. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక పటంలో హైదరాబాద్‌కు ప్రముఖ స్థానం ఉంది.నగరంలోని చార్మినార్‌, గోల్కొండ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌లు ప్రతిరోజు దేశ,విదేశీ పర్యాటకులతో సందడిగా కనిపిస్తుంటారు.ఈ కట్టడాలు నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్‌ సంస్కృతీ,సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తారుు. ఇవన్నీ నేడు హైదరాబాద్‌ వారసత్వ సంపదగా పేరుగాంచారుు.ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఈ చారిత్రక కట్టడాల గురించి తెలుసుకుందామా...

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

చార్మినార్‌...
హైదరాబాద్‌ను పరిపాలించిన కుతుబ్‌షాహి రాజవంశస్థుల్లో అరుుదవ చక్రవర్తి అరుున సుల్తాన్‌ మహ్మద్‌ కులీకుతుబ్‌షా చార్మినార్‌ను నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో హైదరాబాద్‌లో భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చింది. దీంతో మహ్మద్‌ కులీకుతుబ్‌షా తన హైదరాబాద్‌ సామ్రాజ్యంలోని ప్రజలను ప్లేగు వ్యాధి బారినుంచి రక్షించేందుకు చార్మినార్‌ను నిర్మించారు.

charminarనాలుగు మినార్‌లతో నిర్మించిన అందమైన కట్టడమే చార్మినార్‌. హైదరాబాద్‌ అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది చారిత్రక చార్మినారే. క్రీ.శ.1591లో చార్మినార్‌ను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ అందమైన కట్టడం నేడు దేశంలోని ప్రముఖ చారిత్రక కట్టడంగా పేరుగాంచింది. హైదరాబాద్‌ పాతబస్తీలోని మూసీ నదికి తూర్పున ఈ కట్టడాన్ని నిర్మించారు. చార్మినార్‌కు ఉత్తరంవైపున తళుకులీనే గాజులు లభించే లాడ్‌బజార్‌ను ఏర్పాటుచేశారు. ఈ బజార్‌ ఎల్లప్పుడు దేశ,విదేశాల పర్యాటకులతో కిటకిటలాడుతుంటుంది. చార్మినార్‌కు పశ్చిమం వైపున ముస్లింలకు పవిత్రమైన మక్కా మజీద్‌ను నిర్మించారు. హైదరాబాద్‌ను పరిపాలించిన కుతుబ్‌సాహి రాజవంశస్థుల్లో అయిదవ చక్రవర్తి అయిన సుల్తాన్‌ మహ్మద్‌ కులీకుతుబ్‌షా చార్మినార్‌ను నిర్మించారు. ఆ కాలంలో హైదరాబాద్‌లో భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చింది.

దీంతో మహ్మద్‌ కులీకుతుబ్‌షా తన హైదరాబాద్‌ సామ్రాజ్యంలోని ప్రజలను ప్లేగు వ్యాధి బారినుంచి రక్షించేందుకు చార్మినార్‌ను నిర్మించారు. తాను ప్రార్థనలు జరిపే చోట మజీద్‌లాంటి చార్మినార్‌ను రూపొందించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ భారీ కట్టడానికి శంకుస్థాపన చేసేటప్పుడు కులీకుతుబ్‌షా అల్లాను ప్రార్థిస్తూ హైదరాబాద్‌ నగరం శాంతి, సౌఖ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. నీటిలో చేపల మాదిరిగా తన నగరంలో లక్షలాది ప్రజలు జీవించాలని కోరుకున్నారు. ఇక సనంవెంకట బాలయ్య ‚అనే వ్యక్తికి చార్మినార్‌ను నిర్మించే బాధ్యతలను అప్పగించారు. నాలుగు మినార్‌లతో నిర్మించిన ఈ కట్టడానికి చార్మినార్‌ను అనే పేరును పెట్టారు మహ్మద్‌ కులీకుతుబ్‌షా. ఈ అద్భుత కట్టడం ప్రపంచంలోనే అపురూప కట్టడంగా పేరొందింది.

గోల్కొండ...
గోల్కొండ కోట ప్రధానగేటు వద్ద చప్పట్లు కొడితే కోట పైభాగాన300 అడుగుల ఎత్తునఉన్న పోర్టికో కట్టడంలో శబ్దం వినిపిస్తుంది.ప్రపంచంలోఎక్కడా లేనివిధంగాఈ కోటలోఇటువంటిఅద్భుతాన్నిచూడవచ్చు.
ఇదే గోల్కొండ కోట ప్రత్యేకత.


golcondaఅద్భుతమైన కోట గోల్కొండ. గోల్కొండ చక్రవర్తులకు రాజధాని కేంద్రంగా ఆ కాలంలో ఈ కోట విలసిల్లింది. హైదరాబాద్‌కు పశ్చిమాన 11 కి.మీ.ల దూరంలో దీన్ని నిర్మించారు. గోల్కోండ సామ్రాజ్యం 1364 నుంచి 1512 వరకు కొనసాగింది. కాకతీయ సామ్రాజ్య కాలంలోనే ఈ కోటను నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 13వ శతాబ్దంలో గోల్కొండ కోటను హిందూ కాకతీయ రాజులు నిర్మించారు. మొగల్‌ సామ్రాజ్యాధీశుల దాడుల నుంచి రక్షించుకునేందుకు మధ్యలో ఈ కోటను తూర్పున వైపున పునర్నిర్మించి మరింత ధృడంగా మార్చారు. ఇక గోల్కొండ కోట ప్రధాన గేటు వద్ద చప్పట్లు కొడితే కోట పైభాగాన 300 అడుగుల ఎత్తున ఉన్న పోర్టికో కట్టడంలో శబ్దం విని
పిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈ కోటలో ఇటువంటి అద్భుతాన్ని చూడవచ్చు. ఇదే గోల్కొండ కోట ప్రత్యేకత. నాడు ఈ కోట వద్ద వజ్రాల వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది. వజ్రాలను వీధులలో పోసి అమ్మేవారని చరిత్ర చెబుతుంది.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్‌ వజ్రం గోల్కొండ కోటకు చెందినదే. హోప్‌ డైమండ్‌ కూడా ఇక్కడిది కావడం విశేషం. గోల్కొండకు వాయువ్య దిశలోని కుల్లూరు గనులలో నాడు వజ్రాలు లభించేవి. ఇక ఈ కోటను 120 మీటర్ల కొండపైన నిర్మించారు. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు 1687లో ఈ కోటను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించాడు. తొమ్మిది నెలల పాటు గోల్కొండ కోటను శత్రువులకు దక్కకుండా కుతుబ్‌షాహి చక్రవర్తి పోరాడాడు. చివరికి ఈ కోట మొగల్‌ చక్రవర్తి వశమైంది. తానీషా కాలంలో భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న చక్రవర్తికి చెప్పకుండా రాజ్యానికి చెందిన డబ్బులతో భద్రాచలాన్ని నిర్మించాడు. ఇది తెలిసిన చక్రవర్తి రామదాసును గోల్కొండ కోటలోని ఓ జైలులో బంధించాడు. ఈ జైలు నేటికీ గోల్కొండ కోటలో చూడవచ్చు.

సాలార్‌జంగ్‌ మ్యూజియం..
సాలార్‌జంగ్‌ మ్యూజియంలో అద్భుతమైన కళాఖండాలు, పెరుంటింగ్స్‌, కార్వింగ్స్‌, ఆకర్షణీయమైన రాచరిక వస్త్రాలు, తాళపత్ర గ్రంథాలు, సెరామిక్‌ వస్తువులు, మెటల్‌ కళాకృతులు, కార్పెట్లు, గడియారాలు, దేశ, విదేశాలకు చెందిన అందమైన ఫర్నీచర్‌ను పొందుపరిచారు. మనదేశంతో పాటు జపాన్‌, చైనా, బర్మా,నేపాల్‌,పర్షియా,ఈజిప్ట్‌,యూరప్‌, అమెరికాలకు చెందిన ఆకర్షణీయమైన ఫర్నీచర్‌ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

salrjung-musium-చారిత్రక హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటైంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాలార్‌జంగ్‌ మ్యూజియం. మూసీ నదికి దక్షిణాన నాడు దీన్ని నిర్మించారు. ప్రస్తుతం దేశానికి చెందిన నేషనల్‌ మ్యూజియంలలో ఇది ఒకటి. అద్భుతమైన కళాఖండాలు, పెయింటింగ్స్‌, కార్వింగ్స్‌, ఆకర్షణీయమైన రాచరిక వస్త్రాలు, తాళపత్ర గ్రంథాలు, సెరామిక్‌ వస్తువులు, మెటల్‌ కళాకృతులు, కార్పెట్లు, గడియారాలు, దేశ, విదేశాలకు చెందిన అందమైన ఫర్నీచర్‌ను ఈ మ్యూజియంలో పొందుపరిచారు. మ్యూజియంలో ఒకటవ శతాబ్దానికి చెందిన కళాఖండాలు కూడా ఉండడం విశేషం. హైదరాబాద్‌ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏడవ నిజాం వద్ద ప్రధానమంత్రిగా చేసిన మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ సాలార్‌జంగ్‌-3 సాలార్‌జంగ్‌ మ్యూజియం నెలకొల్పాడు. 35 సంవత్సరాల పాటు దేశ,విదేశాలకు చెందిన కళాఖండాలను ఆయన సేకరించి వాటితో మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు.

ఇసాలార్‌జంగ్‌ సేకరించిన కళాఖండాల్లో కేవలం సగం మాత్రమే నేడు సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఉన్నాయని అంటారు. ఇక ముందుగా దివాన్‌దేవ్డీలో కొనసాగిన ఈ మ్యూజియాన్ని మదీనాకు సమీపంలోని మూసీనది తీరంలో నిర్మించిన కొత్త భవనానికి తరలించారు. ఈ సందర్భంగా పలు కళాఖండాలు చోరీకి గురయ్యాయి. 1968లో మ్యూజియాన్ని తరలించారు. ప్రస్తుతం ఈ మ్యూజియం నిర్వహణను ట్రస్టీలతో కూడిన బోర్డు చూసుకుంటుండగా రాష్ట్ర గవర్నర్‌ బోర్డు ఎక్స్‌-అఫియో చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. రాజారవివర్మకు చెందిన అరుదైన పెయింటింగ్స్‌, ఔరంగాజేబు ఉపయోగించిన ఖడ్గం, జహంగీర్‌, నూర్జహాన్‌, షాజహాన్‌ వంటి మొగల్‌లకు చెందిన డాగర్లు, టిప్పు సుల్తాన్‌కు చెందిన ఆయుధాలు, వస్తువులు, బంగారం, వజ్రాలతో తయారైన టిఫిక్‌ బాక్స్‌ వంటివి సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

చౌమహల్లా ప్యాలెస్‌..
1750లో ఐదవ నిజాం నవాబ్‌ సలాబత్‌ జంగ్‌ చౌమహల్లా ప్యాలెస్‌ నిర్మాణాన్ని ్ర పారంభించారు. ఎంతో అందంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం నిర్మాణం 1869లో ముగిసింది. టెహ్రాన్‌లోని ఇరాన్‌ షా ప్యాలెస్‌ నమూనాలో దీన్ని నిర్మించినట్టు ప్రతీతి.

chowmahalla-palace-హైదరాబాద్‌ సామ్రాజాన్ని పరిపాలించిన నిజాం నవాబుల అధికారిక నివాసం చౌమొహల్లా ప్యాలెస్‌. చారిత్రక చార్మినార్‌కు కొంత దూరంలో ఈ అందమైన ప్యాలెస్‌ను నిర్మించారు. పర్షియాలో చహర్‌ అంటే నాలుగు అని, అరబిక్‌లో మహలత్‌ అంటే ప్రాంతాలని అర్థం. దీంతో చౌమహల్లా అంటే నాలుగు ప్రాంతాలు లేదా నాలుగు ప్యాలెస్‌ల సమూహమని అర్థం. నిజాంకు సంబంధించిన అన్ని అధికార కార్యక్రమాలు, వేడుకలను ఈ ప్యాలెస్‌లోనే జరిపేవారు. ఇక ఈ చారిత్రక కట్టడానికి గత ఏడాది మార్చి 15న కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌కు గాను యునెస్కో ఏషియా పసిఫిక్‌ మెరిట్‌ అవార్డును ప్రదానం చేసింది. యునెస్కో అధికార ప్రతినిధి తకహికో మకినొ ఈ అవార్డును నిజాం నవాబు అయిన ప్రిన్స్‌ ముకరంజా బహదూర్‌ మాజీ సతీమణి, ఆయన జిపిఎ హోల్డర్‌ ప్రిన్సెస్‌ ఎస్రాకు అందజేశారు.

ఇక 1750లో ఐదవ నిజాం నవాబ్‌ సలాబత్‌ జంగ్‌ చౌమహల్లా ప్యాలెస్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎంతో అందంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం నిర్మాణం 1869లో ముగిసింది. టెహ్రాన్‌లోని ఇరాన్‌ షా ప్యాలెస్‌ నమూనాలో దీన్ని నిర్మించినట్టు ప్రతీతి. ఈ ప్యాలెస్‌లో రెండు కోర్టు యార్డ్‌లు ఉన్నాయి. నాలుగు అందమైన ప్యాలెస్‌ల సమాహారంగా దీన్ని నిర్మించారు. దర్బార్‌ గ్రాండ్‌ ఖిల్వత్‌ను అత్యద్భుతంగా రూపొందించారు. అందమైన ఫౌంటేన్‌లు, గార్డెన్‌లతో 45 ఎకరాల సువిశాల స్థలంలో నిజాం నవాబులు తన అధికారిక నివాసాన్ని నిర్మించారు.

ఫలక్‌నుమా ప్యాలెస్‌...
fuluknuma-palaceదేశంలోని అందమైన ప్యాలెస్‌లలో ఫలక్‌నుమా ప్యాలెస్‌ ఒకటి. పైగా వంశస్థులు నిర్మించిన ఈ ప్యాలెస్‌ను ఆ తర్వాత నిజాం నవాబులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. చార్మినార్‌కు 5 కి.మీ.ల దూరంలో 32 ఎకరాల స్థలంలో ఈ కట్టడాన్ని అందం గా నిర్మించారు. హైదరాబాద్‌ ప్రధానమంత్రి నవాబ్‌ వికార్‌-ఉల్‌-ఉమ్రా దీన్ని రూపొం దించారు. ఆయన ఆరవ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ ఖాన్‌ బహదూర్‌కు సమీప బంధు వు. ఇక ఫలక్‌నుమా అంటే ఉర్దూలో ఆకాశం వంటిందని, ఆకాశానికి అద్దం వంటిదని అర్థం. ఇంగ్లీష్‌ ఆర్కిటెక్ట్‌  డిజైన్‌ చేసిన ఈ ప్యాలెస్‌ నిర్మాణం పూర్తి కావడానికి 9 సంవత్స రాల సమయం పట్టింది. ఈ ప్యాలెస్‌ను తేలు ఆకారంలో నిర్మించారు. ప్యాలెస్‌కు ఉత్తర దిశన రెండు రెక్కల వంటి నిర్మాణాలను చేపట్టారు. మధ్య భాగంలో ప్యాలెస్‌ ప్రధాన భవనం, గోల్‌ బంగ్లా, జెనానా మహల్‌ వంటి వాటిని రూపొందించారు. ఇటాలియన్‌, ట్యుడర్‌ ఆర్కిటెక్చర్‌లో ప్యాలెస్‌ అందంగా రూపుదిద్దుకుంది. రంగు,రంగుల అద్దాలతో కూడిన కిటికీలు ప్యాలెస్‌కు ప్రత్యేక ఆకర్షణను చేకూరుస్తున్నాయి.

No comments:

Post a Comment