Total Pageviews

Tuesday 27 September 2011

ఊటీని మరిపించే రెడ్‌హిల్స్‌

దేవుడే గనుక చిత్రకారుడైతే కాన్వాస్‌పై చిత్రించే ప్రకృతి దృశ్యాలు భూమిపై నిజంగా ఎలా ఉంటాయో చూడా లనుకుంటే రెడ్గహిల్స్‌కు వెళ్ళాల్సిందే. ఊటిని మరిపించే అందాలెన్నో ఇక్కడ ఉన్నారుు. చల్లటి వాతావరణం, రమణీయ పరిసరాలు. ప్రకృతి ఆరాధకులకు అంతకు మించి కావాల్సింది మరేమిటి? అందుేక అలాంటి వారంతా ఎంచుకునేది రెడ్గహిల్స్‌నే. ఊటీకి చేరువలోనే ఇది ఉండడం విశేషం. ఊటీకి వెళ్ళితే దీన్ని చూడడం మరువకండి.

vaguఈ ప్రాంతం ఊటికి 24 కి.మీ. దూరంలో ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకుండా వున్న ప్రదేశం. ఇది బెంగుళూరుకు 325 కి.మీ. దూరంలో వుంది. బెంగుళూరు నుంచి రాష్ట్ర రహదారి 17 బండిపూర్‌, వయా మాండ్య మైసూర్‌ మంజన్‌ రోడ్డుల మీదుగా చేరవచ్చు. తమిళనాడు రాష్ట్ర రహదారి ఊటికి వయా తెప్పకాడు, గండలూరు జిల్లా రహదారి రెడ్‌హిల్స్‌కు వయా పలాడ ఐతలార్‌, ఎమరాల్డ్‌ మీదగా చేరవచ్చు.

Red+Hill+Nature+Resortఅతి సన్నని ముతరామ్‌ రోడ్డు ఊటీ గ్రామాలయిన పలాడ ఉతలార్‌, ఎమరాల్డ్‌ గ్రామాల మీదుగా క్యారెట్‌, క్యాబేజ్‌, పంట పొలాల మధ్యగా రెడ్‌హిల్స్‌ చేరవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం వెనుకకు జరిగి ఆలోచిస్తే బ్రిటిషు వారు ఈ ప్రాంతాన్ని ఎందుకు ఆదరించారో తెలుస్తుంది. ఈ రెడ్‌హిల్స్‌ అడవులు విశాలమైనవి దట్టమైనవి. ఇక్క వున్న ఆకుపచ్చని దృశ్యాలు ఈ ప్రాంతం అంతా మనలను జీవితాంతం వెంటాడుతూనే వుంటాయి. మధుమలై, కూనురు మనల్ని ఊటినా అన్నట్లుగా భ్రమింపజేస్తాయి. దీనికి దగ్గరలోనే భవాని శాంక్చ్యువరి వుంది. ఈ కొండలు ఇందులో వున్న ఆకు పచ్చని పచ్చికబయళ్ళు నిరంతరం ఒకేలాగా వుంటాయి. ఇది బ్రిటిషువారు ఇదే పేరున్న ప్రదేశాన్ని గుర్తుకు తెస్తుంది. రెడ్‌హిల్స్‌కు 25 కి.మీ. వ్యాసార్థంలో నడిచి చూస్తే పక్షుల కిలకిలారావాలతో మధ్యాహాన్ని అతి తేలికగా గడపవచ్చు. రెడ్‌హిల్స్‌లో ఉన్న దారులు అన్ని కూడా చాలా సన్నగా వుంటాయి.

selayeru లేక్‌ డిస్ట్రిక్ట్‌...
ఇక్కడ 8 సరస్సులున్నాయి. ఇవి ఎమరాల్డ్‌ ఎవలాంచి అప్పర్‌ భవాని, పార్శన్‌ వాలి లేక్‌, పార్టిమండ్‌, వెస్ట్రన్‌ క్యాచ్‌మండ్‌ కూడా అద్దాలువలె కనిపిస్తూ మబ్బులను ప్రతిబింబింపజేస్తాయి. ఇక్కడ జూన్‌ నుంచి ఆగస్టులో 100 అంగుళాల వర్షపాతం నమోదువుతుంది.

అవలాంచి...
ఇది ఎమరాల్డ్‌కు 13 కి.మీ. దూరంలో వుంటుంది. ఈ గ్రామం పేరు అవలాంచి. ఇక్కడ నీలగిరిలోని ప్రాచీనమైన ఆటవిక తోడ తెగవారు వున్నారు. వారు పశుపోషకులు. ప్రాచీన కాలంలో వారు నెయ్యి, వెన్న వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జీవించేవారు. అవలాంచి 100 సం వయస్సు కలది. ఈ పచ్చిక బయళ్ళు పార్శ్వన్‌ వాలి లేక్‌ ఒక స్వతంత్య్ర వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ వచ్చాయి. ఎమరాల్డ్‌ అవలాంచిలో 1980లో హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ స్టేషన్‌ నిలిపారు.

No comments:

Post a Comment